సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6:
జిల్లా కలెక్టర్ దినకర్ ఆదేశాల మేరకు సోంపేట ఏపీ మోడల్ స్కూల్ ను స్థానిక ఎంపిడివో బెందాళం వెంకటరమణ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. సోంపేట పట్టణానికి చెందిన మురుగు కాలువల ద్వారా పాఠశాల మైదానం లోపలకి మురుగునీరు చేరడం వలన విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న విషయం పాఠశాల సిబ్బంది పలు దపాలు తమ ధృష్టికి తెచ్చారని , తక్షణమే చర్యలు తీసుకోవాలని సోంపేట మేజర్ పంచాయితీ ఈవో ఎం.శాంతకుమారిని ఆదేశించారు. నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తామని పంచాయతీ సిబ్బంది ఈ సందర్భంగా ఎంపిడివో కు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి వి వెంకటేశ్వర్లు , పంచాయతీరాజ్ ఏఈ కె రమేష్ ,ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ కమల్ వికాస్, పంచాయతీ సిబ్బంది మరియు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నాజీ వర్మ తదితరులు శపాల్గొన్నారు.