సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6
యూటీఎఫ్ స్వర్ణోత్సవాలలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరికీ ఈనెల 8 న ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ జల్లా అధ్యక్షులు లండ బాబూరావు నేడొక ప్రకటనలో తెలిపారు. కవిటిలో క్రికెట్, షటిల్, కంచిలిలో వాలీబాల్ పోటీలు నిర్వహించబడతాయని ఈ కార్యక్రమానికి బాధ్యులుగా జిల్లా కార్యదర్శి యం మురళి ప్రకాష్ ,జి మాధవరావు వ్యవహరిస్తారని , నిర్వహణలో 4 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూర్తిస్థాయిలో బాధ్యులుగా ఉంటారని తెలియజేశారు, కావున ఈ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు