అధికారం పోయాక వైసీపీ నాయకులు కొత్త నాటకాలు మొదలు పెట్టారని

9/6/2024 9:19:22 PM

భీమునిపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6;
టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి  సమావేశంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలో ఉండగా అడ్డగోలుగా ఆస్తి పన్ను పెంచారని , టిడిపి, జనసేన, బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించినా  చెత్త పన్ను సేకరణపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని , అధికారం చేజారేసరికి మొసలి కన్నీరు కారుస్తున్నారని, చెత్త పన్ను రద్దు చేయాలని వినతి పత్రాలు ఇస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అందుకే సార్వత్రిక ఎన్నికల్లో 11సీట్లకు పరిమితం చేసారని ఇకనైనా కౌన్సిల్ లో కూడా వైసీపీ బలం తగ్గుతుందని, ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలయిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో విశాఖ ఘనంగా అభివృద్ధి చెందుతుందని వైసీపీ నాయకులు అధికారం ఉంటే ఒకేలా అధికారం పోతే ఒకేలా ప్రవర్తించడం మంచిది కాదని ఆమె అన్నారు. అలాగే ఈ మూడేళ్లలో వైసీపీ చేసిన అక్రమాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆమె  తెలిపారు.

Name*
Email*
Comment*