భీమునిపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6;
భీమునిపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భీమునిపట్నం నాగేశ్వరరావు చేతులమీదుగా వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలు న్యాయవాదులకు,కోర్టు సిబ్బందికి , న్యాయవాదులు గుమస్తాలకు , కక్షిదారులకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాలుష్య రహిత వాతావరణం కోసం ఈ కార్యక్రమమును చేపట్టిన భీమునిపట్నం బార్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద సంఘ అధ్యక్షులు ఎం వి పార్వతీశం, కోశాధికారి ముమ్మిడిశెట్టి సునీల్ , న్యాయవాదులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు , బాల భాస్కర్, ఏపీపీ రవి, వాణి తదితరులు పాల్గొన్నారు.