మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

9/6/2024 9:21:25 PM

భీమునిపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6;
భీమునిపట్నం బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భీమునిపట్నం నాగేశ్వరరావు చేతులమీదుగా వినాయక చవితి సందర్భంగా  మట్టి వినాయక  ప్రతిమలు  న్యాయవాదులకు,కోర్టు సిబ్బందికి , న్యాయవాదులు గుమస్తాలకు ,  కక్షిదారులకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు  మాట్లాడుతూ  కాలుష్య రహిత వాతావరణం కోసం ఈ కార్యక్రమమును చేపట్టిన  భీమునిపట్నం బార్ అసోసియేషన్  ప్రతినిధులను  అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద సంఘ అధ్యక్షులు ఎం వి పార్వతీశం,  కోశాధికారి  ముమ్మిడిశెట్టి సునీల్ , న్యాయవాదులు    పోలిశెట్టి వెంకటేశ్వరరావు ,  బాల భాస్కర్, ఏపీపీ రవి, వాణి   తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*