తోటవీధి సంపత్ వినాయక ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

9/6/2024 9:23:14 PM

భీమునిపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6;
భీమిలి తోట వీధిలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ సంపత్ వినాయక ఆలయంలో ఈ నెల ఏడవ తారీఖు నుండి వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు చిట్టిల్ల శ్యాం శర్మ తెలియజేశారు. ఈ నవరాత్రులలో ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు మరియు సాయంత్రం అయిదు గంటలకు భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. వినాయక చవితి పర్వదినమైన శనివారం ఉదయం అయిదు గంటలకు స్వామి వారి మూల విరాట్ కు పంచామృతాభిషేకం నిర్వహిస్తామని, బుధవారం పదకొండో తారీఖున సాయంత్రం ఏడు గంటలకు అష్టోత్తర శత అఖండ దీపారాధన జరుపుతామని చెప్పారు. గురువారం పన్నెండో తారీఖున ఉదయం అయిదు గంటలకు  దూర్వార్చన, శనివారం పద్నాలుగో తారీఖున ఉదయం పది గంటలకు శ్రీ లక్ష్మీగణపతి హోమం జరుగుతాయని ఆయన తెలియజేశారు. పదిహేనో తారీఖు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని అర్చకులు శ్యాం శర్మ చెప్పారు. పూజా కార్యక్రమాలలో పాల్గొనదలచిన భక్తులు 9849934746 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Name*
Email*
Comment*