డిజి యాత్ర సేవలను ప్రారంభించిన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు

9/6/2024 9:27:26 PM

-విశాఖ ఎయిర్ పోర్ట్ లో

ఎన్ఏడి, ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 06: 
దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దేశంలో ఈ రోజు తొమ్మిది ఎయిర్ పోర్టులలో డిజి యాత్ర సేవలు ప్రారంభించామన్నారు. దేశంలో 24 ఎయిర్ పోర్టులలో డిజి యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
3 కోట్ల మంది విమాన ప్రయాణికులు డిజి యాత్ర సేవలను వినియోగించుకున్నారన్నారు.డిజి యాత్ర ఒక విప్లవాత్మకమైన మార్పు అని.. ఈ సేవల ద్వారా ప్రయాణికులు సులభతరంగా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించవచ్చని రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టు.. తన హోమ్ ఎయిర్ పోర్టు అని. కొనియాడారు
భవిష్యత్తులో మరిన్ని విమాన సర్వీసులు రాబోతున్నాయన్నారు. అక్టోబర్ 27వ తేదీ నుంచి విశాఖ నుంచి విజయవాడకు ఉదయం ఒక విమానం సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి తన వంతు కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మరో రెండు సంవత్సరాలలో భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోకి మరిన్ని ఎయిర్ పోర్టులను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖ ఎయిర్ పోర్టు లో కార్గో సేవలను పెంపొందిస్తామన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడంలో పౌర విమానయాన శాఖ ముందు ఉంటుంది. దేశంలో ఎయిర్ పోర్టు సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డిజి యాత్ర యాప్‌లో ప్రయాణికుల వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. విమాన ప్రయాణికులు తప్పకుండా డిజి యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. డిజి యాత్ర ద్వారా ప్రయాణికులు సులభంగా విమాన ప్రయాణం చేయవచ్చని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Name*
Email*
Comment*