అమలాపురం, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్: 06
అమలాపురం జనసేన పార్టీ , జానీ భాష సేవా సమితి. అధినేత షేక్ కరీముల్లా బాబా ఆధ్వర్యంలో స్థానిక మసిద్ సెంటర్ వద్ద శుక్రవారం వినాయక చవితి పురస్కరించుకొని హిందూ సోదరులకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన జనసేన పార్టీ సీనియర్ లీడర్ లింగోలు పండు మొహమ్మద్ బషీర్లు మాట్లాడుతూ కాలుష్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను ఉపయోగించడం ఉత్తమం అన్నారు అలాగే వినాయక చవితి నిమజ్జనాల్లో ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరు ఉత్సాహంగా చేసుకోవాలన్నారు .మెయిన్ రోడ్డు వద్ద ముస్లిం సోదరులు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన చేతుల మీదుగా విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. జనసేన నాయకులు తిక్క సరస్వతి ,గారు. మొహమ్మద్ మహబూబ్ షరీఫ్, మునవర్ ,షఫీ , భాష , బాబులు, దూలం బుజ్జి కొరసాల వీరబాబు. పవన్ మారుతి కేర్ సభ్యులు. పాల్గొన్నారు.