మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం

9/6/2024 10:20:26 PM

-   కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్;
మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపు నిచ్చారు.  శుక్రవారం స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
శ్రీకాకుళం శాసనసభ్యులు  గొండు శంకర్ శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలి, మిల్లు జంక్షన్, పాత బస్టాండ్ వద్ద (శ్రీకాకుళం నియోజకవర్గంలో 12 ప్రదేశాలలో) ఈరోజు 30,000 మట్టి గణపతి విగ్రహాలు, వినాయక వ్రతకల్పం (పుస్తకం) పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు  మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమందరం సమిష్టిగా కృషి చేయాలని, సహాజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమగా లభించే ప్లాస్టర్ ఆఫ్ పారీస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వలన పర్యావరణానికి హానికరమని, హానికర రసాయణాలతో తయారు చేసిన గణపతిని నిమార్జనం చేయడం వలన జలవనరులు కాలుష్యానికి గురికావడం జరుగుతుందని, వీటి వలన జల వనరుల నాణ్యత తగ్గడంతో పాటు వృక్ష, జంతు జీవనం పై ప్రభావం కలుగుతుందన్నారు. 
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారీస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వలన నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ, రక్త, కంటి సంబంధిత వ్యాధులు ఇతర సమస్యలు వస్తాయన్నారు. 
ఈ పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు  గొండు శంకర్ విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను, ప్రకృతి తో తయారయ్యే పత్తి , నారా వంటి పదార్థాలను వినియోగించుకోవాలని పర్యావరణ పరిరక్షణ వలన  రానున్న భావితరాలకు  మంచి వాతావరణం అందజేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*