బెదిరింపు కేసు నమోదు
-
అమరావతి , ఎక్స్ప్రెస్ న్యూస్
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తిరుపతిలోని బీమాస్ హోటల్లో తనపై లైంగిక దాడి చేశాడని ఓ యువతి ఆరోపించింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలు కొన్ని వీడియోలను విడుదల చేసింది. దీంతో స్పందించిన టీడీపీ అధిష్టానం వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తిరుపతి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. భీమాస్ ప్యారడైజ్ హోటల్లో ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మల్యేపై బలాత్కారం, బెదిరించి అత్యాచారం చేశారని కేసు నమోదు చేశామన్నారు.