సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మూడవ విడత ప్రమోషన్ మేలా నిర్వహించిన విశాఖ నగర్ పోలీస్ కమిషనర్

9/6/2024 10:32:08 PM

            విశాఖపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్, 6       
*ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నందు మొట్టమొదటి సారిగా సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, విశాఖ కమిషనరేట్ నందు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ పదోన్నతి పొందిన  సిబ్బందిని సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్ అందజేయు కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విధతమే. ఈ రోజు మూడవ విడతగా నగర పోలీసు కమిషనరేట్ కు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్  అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా, 07 గురు ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుళ్ళు ఆర్ముడ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు గా,(గత విడత నిర్వహించిన ప్రమోషన్ మేలా కు విధులు కారణముగా హాజరు కానీ 02 ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుళ్ళు ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుళ్ళ) 06మంది ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుళ్ళు  ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతి పొందడం జరిగినది.
   సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక ప్రాధాన్యం ఎల్లప్పుడూ ఇచ్చే సిపి  పోలీసు శాఖ నందు పదోన్నతి పొందిన సదరు  సిబ్బందిని వారి కుటుంబ సభ్యులతో పాటుగా నగర పోలీసు సమావేశమందిరం (టెంపుల్ ఆఫ్ లెర్నింగ్) కు ఆహ్వానించి , నూతన పదోన్నతి సంబంధించిన ర్యాంకులను, పోస్టింగ్ ఆర్డర్లను స్వయముగా అందజేశారు , ఈ కార్యక్రమంలో జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కే.ఫక్కిరప్ప,  ఏడీసీపీ (అడ్మిన్),ఏడీసీపీ (ఆర్ముడ్ రిజర్వ్), నగర పోలీసు ఉన్నతాధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*