రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 13
కోస్టా సచివాలయంలో శుక్రవారం ఇంజనీర్స్ డే ముందస్తు వేడుకలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్ మోక్షం గుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిసిని జగన్నాథం, ఎం.పీ.టీ.సీ. పి . అసిరి నాయుడు, పి. అప్పయ్య దొర, పంచాయతీ కార్యదర్శి ఆర్. శ్రీధర్, ఇంజనీర్ అసిస్టెంట్ పి. రామ నాయుడు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.