జ‌గ‌న్‌తో సెల్ఫీ ... కానిస్టేబుల్‌పై వేటుకు సిద్ధం

9/13/2024 10:34:45 PM


- ఛార్జి మెమో జారీ
- అలా ఎందుకు ప్ర‌వ‌ర్తించాల్సి వ‌చ్చిందో నోటీసు

అమ‌రావ‌తి, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  
మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషాబానుపై వేటు వేసేందుకు రంగం సిద్ధ‌మైంది. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామ‌ర్శించేదుకు రెండురోజుల క్రితం వెళ్లారు. ప‌రామ‌ర్శ అనంత‌రం మీడియాతో మాట్లాడేందుకు గుంటూరు జైలు బ‌య‌టికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌తో కూతురితో క‌లిసి సెల్ఫీ తీసుకునేందుకు జైలు కానిస్టేబుల్ అయేషాబాను ఆస‌క్తి చూపించారు. అయేషా అనంత‌పురానికి చెందిన వ్య‌క్తి. జ‌గ‌న్‌తో సెల్ఫీ తీసుకుని, ఆయ‌న‌తో క‌ర‌చాల‌నం చేశారు. ఇదంతా టీవీ చాన‌ళ్ల లైవ్‌లోనే జ‌రిగింది. ప్ర‌భుత్వ ఉద్యోగి అయి వుండి. త‌మ‌కు ఏ మాత్రం గిట్ట‌ని జ‌గ‌న్‌తో సెల్ఫీ తీసుకోవ‌డంపై కూట‌మి ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వుంది. దీంతో అయేషాకు గుంటూరు జైల‌ర్ ర‌విబాబు చార్జి మెమో ఇచ్చారు. ఎందుకు అలా వ్య‌వ‌హ‌రించాల్సి వచ్చిందో స‌మాధానం చెప్పాల‌ని షోకాజు నోటీసులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ వివ‌ర‌ణ త‌ర్వాత విచార‌ణకు క‌మిటీ వేస్తామ‌ని జైల‌ర్ పేర్కొన్నారు. ప‌రిణామాల్ని గ‌మ‌నిస్తే కానిస్టేబుల్‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డం ఖాయ‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

Name*
Email*
Comment*