నాన్నా ... నీ అంత ఎదుగుతున్నా

9/13/2024 10:35:56 PM


- అంచ‌లంచెలుగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
- తండ్రికి త‌గ్గ త‌న‌యుడుగా వ‌డివ‌డిగా అడుగులు 

శ్రీకాకుళం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  
ఉత్తరాంధ్ర జిల్లాలలోని శ్రీకాకుళానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రధాని మోడీకి తన వాగ్దాటితో తన పనితీరుతో చురుకుదనంతో బాగా చేరువ అయిపోయారు. టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి స్థాయిని గతంలో దివంగత ఎర్రన్నాయుడు మాత్రమే సంపాదించారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉంటే కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్రన్నాయుడు హవా చలాయించారు. ఏపీలో ఒక నాయుడు ఢిల్లీలో మరో నాయుడు అని అప్పట్లో మీడియాతో పాటు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లోనూ సరదాగా వ్యాఖ్యానించేవారు. అలా చంద్రబాబుకు సమాంతరంగా జాతీయ స్థాయిలో ఎర్రన్నాయుడు ఎదిగారు. బీసీ నేతగా అంతటి ఉన్నతిని ఆయన సాధించారు. ఇపుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా హ్యాట్రిక్ విజయంతో పాటు తండ్రి స్థానాన్ని తాను చిన్న వయసులోనే అందుకున్నారు. లేటెస్ట్ గా చూస్తే ఆయన ఆసియా ఫసిఫిక్ సభ్య దేశాలకు చైర్మన్ గా ఎంపిక కావడం అన్నది గర్వకారణం అని అంటున్నారు.
రామ్మోహన్ పేరుని సింగపూర్ దేశం ఈ పదవికి ప్రతిపాదించగా భూటాన్ దేశం సమర్ధించింది. భారత్ కి దక్కిన గౌరవంగా దీనిని భావిస్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. టీడీపీలో యువతరం నేతలలో వారసులలో బలంగా ఎదుగుతూ తనదైన మార్క్ ని పొలిటికల్ గా వేసుకుంటున్నా రామ్మోహన్ నాయుడు కి ఎంతో ఫ్యూచర్ ఉంది. బీసీ నాయకుడిగా ఉత్తరాంధ్ర రీజియన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారుగా ఈ యువ కేంద్ర మంత్రి టీడీపీలో సరిసాటిగా ఎదుగుతున్నారు అని అంటున్నారు. మిగిలిన యువ నేతలకు వారసులకు ఆయన స్పూర్తిగా నిలుస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Name*
Email*
Comment*