శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్;
జిల్లా క్రైమ్ ఆదనపు ఎస్పీ గా పి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.వి మహశ్వర రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చని అందజేశారు. ఈయన ప్రస్తుతం కాశీబుగ్గ సబ్ డివిజన్ డిఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతి పై (క్రైమ్) అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.