15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

9/17/2024 8:48:56 PM


ముంచంగిపుట్టు (ఎక్స్ ప్రెస్ న్యూస్): సెప్టెంబర్17:  
మండలంలో గల కించయిపుట్టు  పంచాయతీ గుమ్మసిర్గం పుట్టు దారపల్లి గ్రామాలలో 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ సుభాష్ చంద్ర వైస్ ఎంపీపీ సత్యనారాయణలు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి  పనులు ప్రారంభించారు. మంగళవారం వారు  మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించి గుమ్మసిర్గం పుట్టు 45 మీటర్లు దారాపల్లి గ్రామంలో 45 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన శేషమన్నారు. గతంలో గ్రామసభలో తీర్మానం చేసిన తీర్మానం ప్రకారం గుమ్మ సిరగం పుట్టు దారాపల్లి గ్రామాలలో సిసి రోడ్డు నిర్మాణానికి 90 మీటర్లు గాను నిధులు మంజూర అయిందని వారు అన్నారు. 
మిగిలిన గ్రామాలలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, గ్రామస్తులు మట్టం ముక్కి ఆనందరావు, కీల్లో మహేష్ పడల్ మట్టం ముక్కీ శంకర్ రావు, వనుగు సూర్యం, మినుములు సుందరావు, మట్టం ముఖి కృష్ణ రావు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*