నులిపురుగుల నివారణ అందరి కర్తవ్యం...!

9/17/2024 9:03:32 PM

ఆనందపురం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్, 17
 జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని వేములవలస ఎంపీపీ పాఠశాలలో స్థానిక పంచాయతీ ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ స్వయంగా విద్యార్థులకు ఆల్బెండెజోల్ మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాత్రలు ఒకేసారి అందరికీ మింగించడం వల్ల నులిపురుగుల నివారణ సాధ్యమవుతుందన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అరగంట ఆగి మాత్రను నమిలి మింగించాలని సూచించారు. కార్యక్రమంలో సిహెచ్ఓ సూర్య కళ, ఏఎన్ఎం ఉమ పాఠశాల హెచ్ఎం సుభాషిని, అంగన్వాడి టీచర్ నదియా  రాధ తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*