స్పెషల్ డ్రైవ్ ద్వారా నిరాశ్రయులకు వసతి గృహము నందు ఆశ్రయం

9/17/2024 9:11:05 PM

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 17: 
ఆశ్రయం లేక ఫుట్ పాత్ మీద ఉన్న నిరాశ్రయులకు బుచ్చి రాజు పాలెం  జీవీఎంసీ పట్టణ నిరాశ్రయులు వసతి గృహం నందు నైట్ షెల్టర్ అధికారి ఎల్లెటి మమత ఆశ్రయం కల్పించారు. ఆశ్రయం కల్పించడంతో వారిని వివరాలు అడిగి తెలుసుకోగా గోపాలపట్నం రైల్వే స్టేషన్, బస్ షెల్టర్ వద్ద ఆశ్రయం లేక    ఫుట్ పాత్ ల మీద వారి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇందులో కొంతమంది పిల్లలు పెద్దవాళ్లు, వ్యసనాలకు బానిస గా మారి రోడ్డు పాలు అయిన వారు మరి కొంత మంది ఉన్నారు. ఈ మేరకు మంగళవారం బుచ్చిరాజు పాలెం జీవీఎంసీ  నిరాశ్రయ వసతి గృహం మేనేజర్ ఎల్లేటి మమత , గోపాల పట్నం సీఐ సురేష్ ఆదేశాలు మేరకు ఏఎస్ఐ రమణ కానిస్టెబుల్ బంగారమ్మ  కలిసి  స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా ఫుట్ పాత్ మీద కొన్నేళ్లుగా  జీవనం సాగిస్తున్న నిరాశ్రయులను బుచ్చిరాజుపాలెం జీవీఎంసీ  నిరాశ్రయ వసతి గృహం కి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించడం జరిగింది. ఆశ్రయం కల్పించడమే కాకుండా వారి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులుకు అప్పగించే ప్రయత్నం చేస్తాము అని మేనేజర్ మమత తెలిపారు.

Name*
Email*
Comment*