నాయి బ్రాహ్మణులు విశ్వకర్మ లోన్స్ సద్వినియోగం చేసుకోండి- నరవ పైడిరాజు

9/17/2024 9:15:45 PM

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 17: 
విశాఖ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మర్రిపాలెం,పెందుర్తి ఏరియా లో ఆన్ లైన్ ద్వారా ఈనాటికి సుమారు ఎనిమిది వందల మంది కులవృత్తి చేసుకుంటున్న నాయి బ్రాహ్మణులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరవ పైడిరాజు మాట్లాడుతూ సిటీ అధ్యక్షులు ఆతవ సుబ్బారావు  ఆధ్వర్యంలో  విశాఖ జిల్లాలో కులవృత్తి పై జీవనం కొనసాగిస్తున్న నాయి బ్రాహ్మణులు అందరూ విశ్వకర్మ లోన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  విశాఖ అధ్యక్షులు ఆతవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుల వృత్తిపై జీవిస్తున్న జోనల్ సంఘాలు సిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఈ లోన్ పెట్టిన వారికి సుమారు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ముడు వేల రూపాయలు ట్రైనింగ్ అయిన అనంతరం సామాన్ల కొరకు మరో పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అన్ని సంఘాల సభ్యులు ఈ లోన్స్ ఉపయోగించుకోవాలని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యువజన అధ్యక్షులు కోడూరు గణపతి రావు, యువజన సంఘం కోశాధికారి మల్లవలస వర్మ, సంఘ నాయకులు రాజన్న రమణాజీ, నరవ ఈశ్వరరావు, సభ్యులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

Name*
Email*
Comment*