మేజర్ కులస్తులను ఆదుకోవాలి

9/18/2024 10:05:01 PM

* ఘనంగా జాతీయ వెదురు దినోత్సవం

ఇచ్ఛాపురం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 18
మేదరవృత్తికి మద్దతుగా ఆధునిక పరికరాలను పరిచయం చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు పెట్టినట్లయితే మా మేదరోళ్లకు ఉపకారం ఉంటుందని రాష్ట్ర టిడిపి కన్వీనర్ బిసి మేదరి సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ ధూళిపాళ్ల ఎస్ బాబు అన్నారు. బుధవారం జాతీయ వెదురు దినోత్సవం వేడుకలు పట్టణంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి వెదురుతో తయారు చేసిన బుట్టలు, జల్లెడలతో స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోటరీ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ ఏ కేటగిరి లో ఉన్నాం. మాకు ఎటువంటి రాయితీలు అందటం లేదు, ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని అన్నారు. మా మేదరి కులవృత్తి చాలా దయానియా పరిస్థితిలో ఉంది. మా వృత్తికి ముడిసరుకు అలాంటి వెదురు సరైన క్రమంలో దొరకకపోవటంతో మేదర్ల  పరిస్థితి దయనీయంగా మారింది  ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురూజీ భారత ఆనంద స్వామీజీ, ఏసుబాబు, అంతరాష్ట్ర మహేంద్ర సంఘం అధ్యక్షులు తెల్లి ధర్మారావు, కార్యదర్శి తెల్లి వెంకటకృష్ణ, కన్వీనర్ కోయిలి  రామారావు, వైకుంఠ రావు, చందర్రావు, కృష్ణకుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు .

Name*
Email*
Comment*