భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి

9/18/2024 10:14:18 PM

 రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 18 
భూసార పరీక్షలు ఆధారంగా ఎరువులు వాడాలని డిఆర్పి ఏవో సూర్య కుమార్ తెలిపారు. బుధవారం రణస్థలం మండలం వేల్పురాయి గ్రామమునందు వ్యవసాయ శాఖ ఆత్మ సౌజన్యంతో గ్రామీణ విత్తన ఉత్పత్తులు ఎరువులు యాజమాన్యంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భూసార పరీక్షలకు ఆధారంగా ఎరువులు వాడటం వల్ల ఖర్చులు  ఆదాయంతో పాటు నేల స్వభావం బాగుంటుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులకు  అనుగుణంగా  అనుసరించాల్సి ఉంది అని సాగు పద్ధతులు  గురించి  వివరించారు.

Name*
Email*
Comment*