సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 18
విజయవాడ వరద బాధితుల సహాయార్థము ఉద్దానం విద్యాభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సేకరించిన 30 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసినట్టు యు వి వి కార్యవర్గ సభ్యులు బుధవారం పలాసలో ఏర్పాటుచేసిన సమావేశంలో పత్రిక ముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొమ్మాలి శివ, ప్రధాన కార్యదర్శి గోరకల లోకేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు దుమ్ము శంకర్రావు, ఉపాధ్యక్షులు పోతనపల్లి గీతమ్మ, పూర్వ కార్యదర్శి కోరాడ లింగమూర్తి, కుత్తుం వినోద్ తదితరులు పాల్గొన్నారు.