పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

9/18/2024 10:18:57 PM


ఇచ్ఛాపురం, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 18

 ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిందని స్వచ్ఛతా హే సేవా కార్యక్రమాలను ఉద్యమంలో నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఎన్ రమేష్ అన్నారు. స్వచ్ఛత హే సేవా కార్యక్రమంలో బుధవారం పురపాలక సంఘం పరిధి హాస్పిటల్ రోడ్డులో గల గ్రంథాలయ ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశము మొత్తం స్వచ్ఛతా హే సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. అన్ని వార్డులు  పరిశుభ్రత, పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర మెడికల్ ఆఫీసర్ అఖిల్  మనోహర్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*