సీఎం సహాయనిధికి రూ. 3.05 లక్షలు

9/18/2024 10:21:42 PM


మంత్రి నారా లోకేష్‌కు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే  శిరీష

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబరు 18 :

విజయవాడలో వరదలు మిగిల్చిన నష్టాల నుంచి తేరుకుని, అక్కడ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్ర వ్యాప్తంగా పలు వర్గాల ప్రజల నుంచి విరాళాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌కు పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష విజయవాడలో ఆయన్ని కలసి రూ. 3.05 లక్షల  చెక్కులను బుధవారం అందజేశారు. ఇప్పటికే ఆమె పిలుపు మేరకు రాష్ట్రంలోని పలువురు పారిశ్రామిక వేత్తలు సీఎం సహాయనిధికి పెద్దమొత్తంలో విరాళాలు అందజేశారు. ఎమ్మెల్యే శిరీష తన గౌరవ వేతనాన్ని విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. అయితే పలాసలోని ఎస్‌ఎస్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ అనే జీడి పరిశ్రమ, పీబీ కనస్ట్రక్షన్‌ మెటీరియల్‌లు ఒక్కో రూ. లక్ష చొప్పున అందజేశారు. అలాగే పలాస కాష్యూల్యాండ్‌ లయన్స్‌క్లబ్‌ వెల్ఫేర్‌ సొసైటీ రూ. 70వేలు అందించగా, యెరుకోల సత్యారావు అనే వ్యాపారి రూ. 25వేలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఇదిలా ఉండగా, ఎనిమిదో తరగతి చదువుతున్న కె.రుచిత అనే చిన్నారి తోటివారిని ఆదుకోవాలనే తపనతో రూ. 10 వేలు అందించినట్లు మంత్రి లోకేష్‌కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వివరించారు.

Name*
Email*
Comment*