స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి

9/18/2024 10:24:42 PM


సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబరు 18 :

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. విజయవాడలోని మెప్మా ఎండీ తేజ్‌భరత్‌ను ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలాస నియోజకవర్గానికి సంబంధించి స్వయంసహాయక సంఘాల పనితీరును వివరించారు. అలాగే ఆర్పీల జీతభత్యాలు అంశాన్ని ప్రస్తావిస్తూ, అందులోని సాంకేతిక సమస్యలను త్వరితంగా పరిష్కరించాలని కోరారు. పలాస నియోజకవర్గంలో ఎక్కువగా ఉద్దాన ప్రాంతముందని, ఇక్కడ లభించే ముడిసరుకుతో కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకనుగుణంగా అదనపు రుణ సదుపాయాన్ని కల్పించాలని, ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

Name*
Email*
Comment*