విధించిన వారు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వై. గణపతి రావు
ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 19:
కంచరపాలెం ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ ఎన్ఏడి కొత్త రోడ్ కరాస పలు ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడిపే ద్విచక్ర వాహనదారులను 8 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 5 వ స్పెషల్ జ్యూడిషయల్ మేజిస్ట్రేట్ జడ్జి వై. గణపతిరావు 95000/- రూపాయలు ఫైన్ విధించారు. అదేవిధంగా మద్యం సేవించి లారీ నడుపుతున్న ఐదుగురు వ్యక్తులకు, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచగా ఆయా లారీ డ్రైవర్లక వారం రోజులు చొప్పున జైలు శిక్ష విధించినారు. అని కంచరపాలెం ట్రాఫిక్ సీఐ అరంగి దాశరధి తెలిపారు.