స్త్రీ శిశు సంక్షేమ శాఖ పోషణ మహోత్సవాలు ! ముఖ్య అతిధిగా గిడ్డి సత్యనారాయణ

9/19/2024 9:37:23 PM

 పి.గన్నవరం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 19
20 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  పి.గన్నవరం మండలం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పోషణ వారోత్సవాలలో భాగంగా గర్భిణీ స్త్రీలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి అధ్వర్యంలో సీమంతం లు జరిగాయి. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగే  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు, గిడ్డి సత్యనారాయణ పాల్గొని  గర్భిణీ లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ   పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని , పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కొనియాడారు. ప్రభుత్వం ద్వారా లభించే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా సామూహిక  సీమంతంలు, అన్నప్రాసన లు జరిపించారు.అనంతరం  వేణి ఫౌండేషన్  హైదరాబాద్ వారు పంపించిన చీరలు,  అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు తీసుకువచ్చిన పసుపు, కుంకుమ ,పండ్లు, స్వీట్స్  గర్భిణీ స్త్రీలకు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరి, ఎం.పి.డి.ఓ భారతి, ఎం.పి.పి,గనిశెట్టి నాగలక్ష్మి, స్థానిక సర్పంచ్ బొండాడ నాగమణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్స్ పద్మావతి, పుణ్యవతి,  జ్యోతి, అంగన్వాడి టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*