కొమ్మాది: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 19:-
భీమిలి నియోజకవర్గం ఐదవ వార్డ్ పరిధిలో మారి కొలస జంక్షన్ వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించిన మాజీ మంత్రి ప్రస్తుత భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పేదలకు కడుపునిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందదాయకం అని అన్నారు. ఆకలి తీర్చడమే చంద్రన్న ధ్యేయం లక్ష్యం అని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడు రాజబాబు, భీమిలి నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల, ఐదవ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు నమ్మి శ్రీనివాసరావు, ఐదో వార్డ్ టిడిపి పార్టీ ప్రెసిడెంట్ నాగోతి సత్యనారాయణ, ఐదవ వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, ఐదవ వార్డ్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లంక రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.