రాజారావు మాస్టారికి జుట్టు ట్రస్ట్ పురస్కారం

9/19/2024 10:10:06 PM

పొందూరు: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 19:
మన్యం పార్వతీపురం జిల్లా తోటపల్లిలో జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన "మనబడి - మనతోట" (ప్రకృతి గీతాలు) పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ మండలం పొందూరుకు చెందిన జిల్లా శ్రీశ్రీ కళా వేదిక ప్రధాన కార్యదర్శి వావిలిపల్లి రాజారావు మాస్టారికి సత్కారం జరిగింది. ఈ పుస్తకంలో భాగస్వామ్యం అయినందుకు మాస్టారికి జట్టు ట్రస్ట్ పక్షాన జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ దుశ్శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారిణి జి. పగడాలమ్మ, జట్టు ట్రస్ట్ డైరెక్టర్ డి. పారి నాయుడు, బాల సాహితీవేత్తలు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*