రణస్థలంలో పవర్ కట్

9/19/2024 10:23:22 PM

రణస్థలం- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్: 19 
విద్యుత్ లైన్లు మరమ్మత్తుల కారణంగా రణస్థలం 33 /11 కెవి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈ.ఈ  బయ్యన్న నాయుడు తెలిపారు. 11 కెవి కమ్మ శిగడాం ఫీడర్ కు సంబంధించిన వేల్పురాయి కొండమూలగం దేవరపల్లి గ్రామాలు, 11 కేవీ తెప్పలవలస  ఫీడర్ కు సంబంధించినవి, నీలం పేట, చిన్న పట్న పేట గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని ఆయన వివరించారు. దీనికి వినియోగదారులందరూ సహకరించాలని ఆయన కోరారు.

Name*
Email*
Comment*