ఇచ్ఛాపురం- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 19
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిదీ అని కమిషనర్ ఎన్ర.మేష్ అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు పారిశుద్ధ్యం, పరిసరాలు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర, పాఠశాల ఎస్ఓ శిరీష, సచివాలయ వార్డు శానిటేషన్ మరియు ఇన్వర్మెంట్ సెక్రటరీలు పాల్గొన్నారు.