తల్లిదండ్రుల సహకారం అవసరం

9/19/2024 10:31:01 PM


ఇచ్ఛాపురం- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 19

 ఇంటర్ విద్యార్థినిలు చదువులో బాగా రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ సహకరించి బాధ్యత వహించాలని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి. శంకర రావు అన్నారు. గురువారం ప్రిన్సిపాల్ అధ్యక్షతన కళాశాలలో విద్యార్థినిలు,తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువు క్రమశిక్షణ విషయంలో అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటేనే విద్యార్థులు మంచి మార్కులు సాధించగలరని అన్నారు. ఇంటి వద్ద కళాశాలకు వచ్చి వెళ్లే సమయాల్లో విద్యార్థుల ప్రవర్తనను గమనించాలని, కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రక్రియలో  సహకరించాలని కోరారు. అధ్యాపకులు పి సుధాకర్, ఎన్. బాపూజీ, బీ. కరుణాకర్, వై. జనార్ధన, కిరోమని తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*