ఇచ్ఛాపురం- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 19
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని ఎంపీపీ బోర పుష్ప అన్నారు. గురువారం అరకభద్ర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు సరిపడు భోజనం ఇవ్వాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.