జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న నూతన జోనల్ కమిషనర్

9/19/2024 10:44:00 PM

 మధురవా- ఎక్స్ ప్రెస్ న్యూస్ :
గ్రేటర్ విశాఖపట్టణంr జోన్ టు నూతన జోనల్ కమీషనర్ పొందూరు సింహాచలం మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పట్నాల హరి ప్రసాద్ శర్మ, రాంబాబు శర్మ తదితరులు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేసారు. ఆలయ కమిటీ సభ్యులు దుశ్శాలువతో సత్కరించి అమ్మవారి చిత్ర పటాన్ని అమ్మవారి ప్రసాదాన్ని అందజేసారు. జోనల్ కమిషనర్ సత్కరించిన వారిలో ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పిళ్లా పోతరాజు, సుందర శ్రీను, పోతిన రాంబాబు ఉన్నారు.

Name*
Email*
Comment*