రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం

10/17/2024 10:13:56 PM

కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
కొమరాడ మండల పరిధిలోని  గురువారం పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా గుమడ గ్రామంలో 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగడం శుభపరిణామమని కూటమి నాయకులు అన్నారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వంలో అమలు చేయడం  పట్ల  సీఎం చంద్రబాబు నాయుడు కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రము నిధులు  మంజూరు చేయడం పట్ల  ప్రధాని మోడీకి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందక గాయత్రి, కూటమి నాయకులు, కార్యకర్తలు, మరియు పంచాయతీ సెక్రెటరీ,  సచివాల సిబ్బంది, పి ఆర్ జె ఇ ,ఉపాధి హామీ సిబ్బంది, వెలుగు సిబ్బంది, గ్రామ మహిళలు   పాల్గొన్నారు.

Name*
Email*
Comment*