ప్రభుత్వ పాఠశాల ఆయాలకు అవగాహన సదస్సు

10/17/2024 10:17:20 PM

తెర్లాం: వైజాగ్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 17:- 
తెర్లాం మండలం అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలతో ఎంఈఓ జె. త్రినాథ్ రావు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయాలు పాఠశాలలో పారిశుధ్య పనులు ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు రోజు నాలుగుసార్లుపరిశుభ్రత చేయాలని సూచించారు.ప్రభుత్వం సరఫరా చేసినటాయిలెట్ క్లీనింగ్ కెమికల్, క్లీనింగ్ పరికరాలు ఉపయోగించి మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం టాయిలెట్స్ క్లీనింగ్ కెమికల్స్ పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 పాపారావు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, సిఆర్ఎంటిఎస్, ఎం ఆర్ సి  సిబ్బంది ఆయాలు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*