అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కిమిడి

10/17/2024 10:18:49 PM

మెరకముడిదాం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
మెరకముడిదాం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గురువారం శంకుస్థాపన చేశారు. స్థానిక ఎంపీడీవో ఆఫీసు దగ్గర మీటింగ్ హాలు, మంచినీటి కోనేరు దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం నిమిత్తం రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో మండల కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*