పాత మల్లంపేట పంచాయతీలో రెవెన్యూ సదస్సు

10/18/2024 12:36:23 AM

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం. పాత మల్లంపేట పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో రెవిన్యూ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ రెవెన్యూ గ్రామాలలో గతంలో జరిగిన రీ సర్వేలో రైతులకు భూములు సరి చేయడం జరిగిందని, వాటిలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఫిర్యాదు చేసిన తదుపరి భూమి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. సదస్సుకు వచ్చిన రైతులు ఫిర్యాదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిటి చైనులు, సర్పంచ్ ఆదిలక్ష్మి, ఆనంద్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*