యువతకు దిశా నిర్దేశం చేసిన ఎస్సై తారకేశ్వరరావు

10/18/2024 12:38:34 AM

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్,  అక్టోబర్ 17:
అనకాపల్లి జిల్లా గొలుగొండ  మండలం కృష్ణ దేవి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఎల్ పురం బస్ కాంప్లెక్స్ వద్ద. యువతకు కృష్ణా దేవి పేట ఎస్ఐ. వై తాకేశ్వరరావు దిశా నిర్దేశం చేశారు. యువత క్రమశిక్షణతో మెలగాలని, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, ఓపెన్ డ్రింకింగ్ చేయరాదని, కాంప్లెక్స్ ఆవరణలో స్కూలుకి కాలేజీకి వెళుతున్న  అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన, అతివేగంగా వాహనాలు నడిపిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చదువుపై దృష్టి చారించి మీరంతా మంచి ప్రయోజకులు అవుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైటర్ రామారావు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*