నర్సీపట్నంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

10/18/2024 12:46:55 AM

 టౌన్ ప్లానింగ్ అధికారికి స్పీకర్ అయ్యన్న ఆదేశం: 
నర్సీపట్నం- వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
నర్సీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ టౌన్ ప్లానింగ్ అధికారికి పలు సూచనలు చేశారు. నర్సీపట్టణంలోని డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాల్సిన ప్రాధాన్యతను వివరించారు. వర్షాకాలంలో రోడ్లపైకి నీరు రాకుండా సమర్థవంతమైన డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలలో వర్షపు నీరు నిలవఉన్న కారణంగా దోమలు పందులుచేరి పరిసర ప్రాంత ప్రజలకు అంటురోగాలు ప్రమాదం ఉన్నందున ఆస్థలాలను ఎత్తుగా మట్టిపోసి సరి చేసుకోవాలని సంబంధిత స్థలం యజమానులకు నోటీసులు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు.

Name*
Email*
Comment*